Telugu News » మహేష్ బాబు మూవీ ని వదిలేసుకున్నా.. కారణం చెప్తే గొడవలు అవుతాయి.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్..!

మహేష్ బాబు మూవీ ని వదిలేసుకున్నా.. కారణం చెప్తే గొడవలు అవుతాయి.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్..!

by Sravya

రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆమె మనందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో కూడా రేణు దేశాయ్ ఆక్టివ్ గా ఉంటుంటారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత వెండితెరపై కనపడ్డారు రేణు దేశాయ్. మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమాలో ఈమె ఒక ముఖ్య పాత్ర పోషించారు. గుర్రం జాషువా కూతురు హేమలత లవణం పాత్రలో ఈమె ఒదిగిపోయారు.

స్టువర్టుపురం లో దొంగలు నేరస్తులని మార్చాలని.. వాళ్ళల్లో మార్పు తీసుకురావాలని.. వారిని మంచిగా మార్చాలని హేమలత లవణం చేసిన కృషి ఎంతో ఉంది. రీఎంట్రీలో అలాంటి ఒక అభ్యుదయ మహిళా పాత్రలో, రెండు దేశాయ్ కనపడి అందరి ప్రశంసల్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కి సంబంధించిన ఇంకో వార్త కూడా వైరల్ అవుతోంది. గత ఏడాదే ఈమె సినిమాల్లో నటించాల్సి ఉంది. కానీ వచ్చిన అవకాశాలని వదిలేసుకున్నారట.

Also read:

అందుకు కారణాలు చాలా ఉన్నాయి. సూపర్ సార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో నదియా కంటే ముందు ఈమెకి బ్యాంకు మేనేజర్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. కథ మొత్తం విన్నాక ఆమెకి పాత్ర కూడా నచ్చింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన బ్యాంకు మేనేజర్ పాత్రని ఆమె వదిలేసుకున్నారట. ఆ కారణం చెప్తే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అందుకే సైలెంట్ గా ఉంటేనే మంచిదని రేణు దేశాయ్ చెప్పారు.

You may also like

Leave a Comment