Telugu News » accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..!

accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..!

నంద్యాల(Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం(accident)లో ఐదుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్(Hyderabad) వాసులుగా గుర్తించినట్లు సమాచారం.

by Mano
Road Accidents: Fatal accidents.. 10 people died..!

నంద్యాల(Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం(accident)లో ఐదుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్(Hyderabad) వాసులుగా గుర్తించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Accident: Fatal road accident.. Five people died..!

ఆంధ్రప్రదేశ్‌(AP)లోని నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

తిరుపతి నుంచి తిరిగివస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్, మరో బాలుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. నూతన దంపతులకు ఫిబ్రవరి 29న తెనాలిలో వివాహం జరిగినట్లు వెల్లడించారు. ఈనెల 3న తెలంగాణలోని శామీర్‌పేట్‌లో రిసెప్షన్ చేసినట్లు చెప్పారు.

అయితే, తిరుమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వారు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment