Telugu News » Tirumala : తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. మృతి చెందిన మహిళ..!!

Tirumala : తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. మృతి చెందిన మహిళ..!!

మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రయాణిసున్న బైక్‌ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ జ్యోతిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.

by Venu
Road Accident: Bloody roads.. Seven dead..!

తిరుమల (Tirumala) ఘాట్‌ రోడ్డు (Ghat Road)లో ప్రమాదం చోటు చేసుకొంది. బైక్‌ అదుపు తప్పి బస్సును ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కాగా మృతి చెందిన మహిళ గుంటూరు (Gunturu) జిల్లాకు చెందిన జ్యోతిగా పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని 16వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని సమాచారం..

మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రయాణిసున్న బైక్‌ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ జ్యోతిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కాగా, మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న ఈ మార్గంలో ప్రమాదాలు ఆగకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్లక్ష్యం ఎవరిదైనా శ్రీవారి సన్నిధికి వెళ్ళే మార్గంలో ఇలా మరణాలు చోటు చేసుకోవడం విషాదకరం.. ఇప్పటికే కాలినడకన దర్శనానికి వెళ్ళే భక్తులు వన్యమృగాలతో ఇబ్బందులు పడుతోండగా.. రోడ్డు మార్గాలు సైతం ప్రమాదకరంగా మారడం ఆందోళన కలిగిస్తుందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment