Telugu News » Amitabh Bachchan: అయోధ్య రామమందిరం పక్కనే స్థలాన్ని కొన్న బిగ్‌బీ.. ధర ఎంతంటే..!

Amitabh Bachchan: అయోధ్య రామమందిరం పక్కనే స్థలాన్ని కొన్న బిగ్‌బీ.. ధర ఎంతంటే..!

ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.

by Mano
Amitabh Bachchan: Big B bought a place next to Ayodhya Ram Mandir.. What is the price..!

అయోధ్యలో రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జనవరి 22వ తేదీన రామాలయంలోని గర్భగుడిలో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.

Amitabh Bachchan: Big B bought a place next to Ayodhya Ram Mandir.. What is the price..!

ఇక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amithabh Bachchan)  అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

బిగ్‌బీ కొన్న స్థలం సెవెన్‌ స్టార్‌ మల్టీ పర్పస్‌ ఎన్‌క్లేవ్‌ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు. అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు.

‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. అయోధ్యకున్న ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నా’ అంటూ అమితాబ్‌ రాసుకొచ్చారు.

 

You may also like

Leave a Comment