Telugu News » AP News: గుండెపోటుతో తల్లి మృతి.. ఐదు రోజులుగా మృతదేహంతోనే కొడుకు..!

AP News: గుండెపోటుతో తల్లి మృతి.. ఐదు రోజులుగా మృతదేహంతోనే కొడుకు..!

విశాఖ(Vizag)లో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటు(Heart Attack)తో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు ఐదు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు.

by Mano
Students Died in US: Two Telugu students died in America..!

విశాఖ(Vizag)లో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటు(Heart Attack)తో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు ఐదు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

AP News: Mother's death due to heart attack. Son with dead body for five days..!

ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో శ్యామల అనే మహిళ నివాసముంటోంది. ఆమె కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల కిందట శ్యామల సోఫాలో కూర్చుని ఉండగా గుండెపోటు వచ్చింది.

దీంతో ఆమె సోఫాలోనే కన్నుమూసింది. ఇది గుర్తించని స్థితిలో ఉన్న కుమారుడు.. ఐదు రోజులుగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉంటున్నాడు. చుట్టుపక్కల వారికి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు.

దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. కుళ్లిన స్థితిలో శ్యామల మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు సమాచారం ఇవ్వగా త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

You may also like

Leave a Comment