Telugu News » మహేష్ పెళ్లి చేసుకున్నాడని తిరుపతిలో ఒక అమ్మాయి రచ్చ చేసింది.. అందుకే అష్టాచమ్మాలో మహేష్ రోల్.. ఇంత జరిగిందా..?

మహేష్ పెళ్లి చేసుకున్నాడని తిరుపతిలో ఒక అమ్మాయి రచ్చ చేసింది.. అందుకే అష్టాచమ్మాలో మహేష్ రోల్.. ఇంత జరిగిందా..?

by Sravya

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు తన తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఒకరు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అష్టా చెమ్మ సినిమా కోసం పాత్రలకి సరిపడే వాళ్ళని ఎంపిక చేసామని ఆయన చెప్పారు ఒక నాటకం ఆధారంగా ఈ సినిమాని తీసినట్లు తెలిపారు.

హీరోయిన్ మహేష్ ఫ్యాన్ కాబట్టి మహేష్ కి పెళ్లి అయింది కనుక మహేష్ పేరు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ అనుకుంటుంది. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమాను తీశామని ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెప్పారు. అష్టా చెమ్మ సినిమాలో కొన్ని సీన్లు నేచురల్ గా ఉండవని అన్నారు. కెమెరా ముందు నిలబడి ఖాళీగా ఉంటే నాకు నచ్చదు అని కూడా ఆయన చెప్పారు అప్పుడు ఫిలిం ఉండేది ఏమీ మార్చడానికి కూడా అయ్యేది కాదని మోహన్ కృష్ణ చెప్పారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా మైనర్ విజయ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఇంద్రగంటి మోహన్ కృష్ణ చెప్పారు.

Also read:

ఈ సినిమాలో కొంతమంది యాక్టర్లు ఒకే చీరలో కనపడిన సందర్భాలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. కృష్ణగారిలా ఉండే ఒక వ్యక్తితో సినిమాలో ఒక సీన్ షూట్ చేశామని చెప్పారు. మహేష్ కి పెళ్లి అయిన సమయంలో మహేష్ పెళ్లి చేసుకున్నాడంటూ తిరుపతిలో అమ్మాయి రచ్చ చేసిందని అందువలన అష్టా చెమ్మ సినిమాలో మహేష్ ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఈయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ క్రేజ్ కూడా బాగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

You may also like

Leave a Comment