Telugu News » May be : 2023 ఆసియా కప్ లో భారత్ – పాక్ పోరు ముచ్చటగా మూడోసారి…!?

May be : 2023 ఆసియా కప్ లో భారత్ – పాక్ పోరు ముచ్చటగా మూడోసారి…!?

2023 ఆసియా కప్(2023 Asia Cup)లో భారత్ మరోసారి పాక్ తో తలపడే ఛాన్స్ ఉందనే అంచనాలు ఊపందుకున్నాయ్.

by sai krishna

2023 ఆసియా కప్(2023 Asia Cup)లో భారత్ మరోసారి పాక్ తో తలపడే ఛాన్స్ ఉందనే అంచనాలు ఊపందుకున్నాయ్. ఇప్పటికే భారత్-పాకిస్థాన్(India-Pakistan)జట్లు రెండు సార్లు తలపడ్డాయి.

లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వగా..సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్(Pakistan)పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు.


ఇక శ్రీలంకపై విజయంతో టోర్నీలో ఫైనల్ బెర్త్ ను కూడా ఖరారు చేసుకుంది భారత్. ఈ నేపథ్యంలో భారత్ పాక్ పై ముచ్చటగా మూడో సారి తలపడుతుందట. కారణమేంటంటే…సూపర్‌ 4(Super 4) దశలో రెండు వరుస విజయాలతో భారత్ 4 పాయింట్లతో టాప్లో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ రెండేసి మ్యాచ్లు ఆడి.. ఒక్కొక్కటి నెగ్గి వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇక రెండు మ్యాచ్లు ఓడిన బంగ్లాదేశ్.. టోర్నీ నుంచి ఇంటి దారి పట్టింది. అయితే సూపర్ 4 లో తరువాతి మ్యాచ్ పాకిస్థాన్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 14న గురువారం జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ను ఢీ కొడుతుంది.

ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. పాకిస్థాన్ కు  ఎదురుదెబ్బ తగులుతుంది.ఎందుకంటే మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అలా జరిగితే 3 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉంటాయి. కానీ పాక్ కంటే ఎక్కువ రన్రేట్ ఉన్న కారణంగా శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.

అందుకే పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే.. కచ్చితంగా మ్యాచ్ జరిగి శ్రీలంకపై నెగ్గాలి. అదే జరిగితే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ముచ్చటగా మూడోసారి ఇండోపాక్ మ్యాచ్ను చూడవచ్చనని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు.

You may also like

Leave a Comment