బాచుపల్లి (Bachupally) ఠానా పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు (Andhra Police) పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా.. బాలానగర్ (Balanagar) ఎస్ఓటీ (SOT) పోలీసుల కంటికి ఓ వాహనంలో తరలిస్తున్న గంజాయి చిక్కింది. ఆ వాహనంలో ఉన్న వారిని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

కాగా పట్టుకొన్న గంజాయి పాకెట్స్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు బాచుపల్లి పోలీస్లకు అప్పగించారు. మరోవైపు మత్తు పదార్థాలపై తెలంగాణలో కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, తమ అక్రమ దందాకు పోలీస్లనే స్మగ్లర్స్గా వాడుకోవడం చర్చాంశనీయంగా మారింది..