Telugu News » Brs Mp: భయంతోనే బీజేపీ కొత్త దారులు వెతుక్కుంటుంది!

Brs Mp: భయంతోనే బీజేపీ కొత్త దారులు వెతుక్కుంటుంది!

నిర‌స‌న చేయాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వంపై కాదు.. కేంద్రంపై చేయాల‌ని సూచించారు.

by Sai

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం ఉదయం ఆయన దీక్ష విరమించారు.

brs-mp-lingaiah-yadav-fire-on-union-minister-kishan-reddy

ఈ క్రమంలో ఆయన దీక్ష గురించి బీఆర్ఎస్ రాజ్య‌స‌భ ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ మండిప‌డ్డారు. నిరుద్యోగుల పేరిట‌ కిష‌న్ రెడ్డి దొంగ దీక్ష చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి తెలంగాణ‌కు ఏం చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం ఏనాడూ పోరాటం చేయ‌లేద‌న్నారు. నిర‌స‌న చేయాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వంపై కాదు.. కేంద్రంపై చేయాల‌ని సూచించారు.

కేంద్రంలో ప్ర‌తి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి.. దేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడ‌గొట్టిన చ‌రిత్ర బీజేపీది అని లింగ‌య్య యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో 1.40 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటమి భ‌యంతోనే బీజేపీ కొత్త‌దారులు వెతుక్కుంటుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే స్థాయిలో లేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు హామీలు ఇచ్చి.. అమ‌లు చేయ‌కుండా మోసం చేశార‌ని మండిప‌డ్డారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుసరించే వ్యూహాన్ని అధినేత కేసీఆర్ నిర్ణ‌యిస్తార‌ని లింగ‌య్య యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

You may also like

Leave a Comment