Telugu News » Minister Jogi Ramesh: జగన్‌ను ఎవరూ ఓడించలేరు.. మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు…!

Minister Jogi Ramesh: జగన్‌ను ఎవరూ ఓడించలేరు.. మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు…!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy)ని ఎవరూ ఓడించలేరని మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh)కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

by Mano
Minister Jogi Ramesh: No one can defeat Jagan.. Minister Jogi Ramesh's key comments...!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy)ని ఎవరూ ఓడించలేరని మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh)కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

Minister Jogi Ramesh: No one can defeat Jagan.. Minister Jogi Ramesh's key comments...!

అదేవిధంగా మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. పడమట సురేష్ నా తమ్ముడు అనీ… నాతోనే వస్తాడు అనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే, రాజశేఖరరెడ్డి అనుచరులు అందరూ మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు.

కాగా, వైఎస్ షర్మిల చంద్రబాబును కలవడంలో తప్పేమీ లేదన్నారు మంత్రి జోగి రమేష్. శుభకార్యానికి ఎవరినైనా పిలవచ్చని తెలిపారు. అందులో భాగంగానే చంద్రబాబును కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని షర్మిల ఆహ్వానించారని మంత్రి పేర్కొన్నారు.

అయితే, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా ఉండటంతోనే.. అందరూ కలిసికట్టుగా వస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. ప్రజా యుద్ధంలో ఎవరూ వైఎస్ జగన్‌ను ఓడించలేరన్నారు. 20 ఏళ్ల పాటు జగన్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment