Telugu News » Kaleswaram : నేరుగా జోక్యం చేసుకోం.. కాళేశ్వరం అవినీతి దర్యాప్తుపై సీబీఐ..!

Kaleswaram : నేరుగా జోక్యం చేసుకోం.. కాళేశ్వరం అవినీతి దర్యాప్తుపై సీబీఐ..!

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని సీబీఐ, హైకోర్టు (High Court)కు తెలియజేసింది. అయితే కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

by Venu

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) దర్యాప్తుపై సీబీఐ (CBI) కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, 4గురు ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని తెలిపారు.

cm-revanth-reddy-sensational-decision-on-kaleshwaram-project

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని సీబీఐ, హైకోర్టు (High Court)కు తెలియజేసింది. అయితే కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సీబీఐ హైదరాబాద్‌ (Hyderabad) విభాగం హెడ్‌, ఐపీఎస్‌ అధికారి D. కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని కళ్యాణ్‌ చక్రవర్తి హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకొని దర్యాప్తు చేసే అంశంలో సీబీఐకి పరిమితులున్నాయని తెలిపారు. అందుకే ఫిర్యాదులపై స్పందించలేదని వివరించారు. అయితే పిటిషనర్‌ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని తెలిపారు.

ఈ అవినీతి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందని.. కానీ కేవలం రాష్ట్ర ఉద్యోగుల పాత్ర ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ అధికారుల కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని పేర్కొంది..

You may also like

Leave a Comment