Telugu News » Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి ఆమె.. తేల్చిన ఈడీ..!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి ఆమె.. తేల్చిన ఈడీ..!

హైదరాబాద్‌లో కవితతో భేటీలో ఆప్‌ నేతలకు మొత్తం రూ.100 కోట్లు ఇవ్వాలి.. వెంటనే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్‌‌లో తెలిపారు.

by Venu
Breaking: IT searches at MLC Kavitha's house..!

ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి.. దాదాపు రెండు సంవత్సరాలుగా ఊరిస్తున్న ఈ కేసు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ తో యు టర్న్ తీసుకొంది. ఊహించని ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు కీలక వాదనలు ముగిసిన అనంతరం.. హౌస్ అవెన్యూ కోర్టు కవితను ఈడీ (ED) కస్టడీకి ఇచ్చింది.

Delhi-Liquor-Scamఈ క్రమంలో ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపర్చారు. కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని అందులో పేర్కొన్నారు. కవిత, శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారని తెలిపారు. మార్జిన్ మనీని 12శాతానికి పెంచి.. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించినట్లు వివరించారు. అదీగాక లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని అధికారులు పేర్కొన్నారు..

మరోవైపు ఈడీ, సమ్మన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారని స్పష్టం చేసింది. కీలక వ్యక్తిగా వ్యవహరించిన కవిత.. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకొన్నారని రిపోర్టులో తెలిపింది. నిబంధనలు తనకు అనుకూలంగా మార్చుకొని.. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని వెల్లడించారు.. అదేవిధంగా.. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌ కోసం కవిత తనను సంప్రదించారని.. కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్‌ ఇచ్చారని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

ఈ క్రమంలో లిక్కర్ బిజినెస్‌లోకి కవిత టీం ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు.. మాగుంట చెప్పారు. హైదరాబాద్‌లో కవితతో భేటీలో ఆప్‌ నేతలకు మొత్తం రూ.100 కోట్లు ఇవ్వాలి.. వెంటనే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్‌‌లో తెలిపారు. ఆమె సూచనతో రాఘవకు రూ.25 కోట్లు ఇచ్చినట్టు మాగుంట స్టేట్‌మెంట్‌‌లో క్లియర్ కట్‌గా వెల్లడించారు.

అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో రూ.25 కోట్లను ఇచ్చినట్టు మాగుంట రాఘవ కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇండో స్పిరిట్‌లో వాటా గురించి కవితను పిలిచి ప్రశ్నిస్తే ఖండించారు.. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత కు 33% వాటా ఉన్నట్లు క్లియర్ గా ఉందని తెలిపారు. రామచంద్ర పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారని వివరించారు.

ఇక ఢిల్లీకి ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లు కవిత చేర్చిందని.. ఈ రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారని ఈడీ తెలిపింది. కానీ స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వసం చేశారు. అని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మొబైల్ ఫోన్స్ విషయంలోనూ కవిత తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వివరించింది..

అదేవిధంగా ప్రకటన రికార్డ్ చేసే సమయంలో ప్రత్యేకించి అడిగిన ప్రశ్నలకు కవిత అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారు. సాక్షాలను కూడా కవిత ధ్వంసం చేశారు. తాను ఇచ్చిన మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తే.. పది ఫోన్లలో కనీసం నాలుగు ఫోన్లను ఈడీ సమన్లు వచ్చిన ముందు ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది. ఇలా ఏ విధంగా చూసిన ఈడీ రిపోర్టు వివరాల ప్రకారం కవిత ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. అయినా ఇంకా నేను నిర్ధోషిని.. న్యాయం గెలుస్తుందని చెప్పడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు..

You may also like

Leave a Comment