Telugu News » Gujarat : గుజరాత్ యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థులపై దాడి..!

Gujarat : గుజరాత్ యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థులపై దాడి..!

ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా వారిని ఎస్వీపీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. అంతేగాక విదేశీ స్టూడెంట్స్ నివాసముండే హాస్టల్ గదిని కూడా ధ్వంసం చేశారు.

by Venu

మోడీ (Modi), అమిత్ షా (Amit Shah) సొంత రాష్ట్రం అయిన గుజరాత్ (Gujarat)లో దారుణం చోటు చేసుకొంది. విదేశీ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని గుజరాత్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకొంది. పబ్లిక్ స్టేట్ యూనివర్సిటీ (University) ప్రాంగణంలో దుండగులు రాళ్లు రువ్వుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా వారిని ఎస్వీపీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. అంతేగాక విదేశీ స్టూడెంట్స్ నివాసముండే హాస్టల్ గదిని కూడా ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. మరిన్ని ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీలో బలగాలను మోహరించారు. యూనివర్సిటీకి వెళ్లే అన్ని గేట్లను మూసివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు దాడికి గల కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం.. అయితే ఉజ్బెకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన నలుగురు విద్యార్థులు తమ గదుల్లో నమాజ్ చేసే క్రమంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. హాస్టల్‌పై దాడి చేసే సమయంలో నిందితులు మతపరమైన నినాదాలు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు జోక్యం చేసుకుంటారా ? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెంచుకోవడం దేశంపై ఉన్న మంచి భావనను నాశనం చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

You may also like

Leave a Comment