Telugu News » Harish Rao: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు..!

Harish Rao: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు..!

మెదక్ లోకసభ(Medak Loksabha) నుంచి వెంకట్రామిరెడ్డి(Venkat Ramireddy) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రుద్రారంలోని సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు.

by Mano
Harish Rao: Congress graph has fallen.. Harish Rao's key comments..!

తెలంగాణ(Telangana)లోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్(BRS) ప్రచారాన్ని వేగవంతం చేసింది. మెదక్ లోకసభ(Medak Loksabha) నుంచి వెంకట్రామిరెడ్డి(Venkat Ramireddy) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రుద్రారంలోని సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు.

Harish Rao: Congress graph has fallen.. Harish Rao's key comments..!

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు తియ్యగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటున్నాడని ఆక్షేపించారు.

రేవంత్ సీఎం అనుకుంటున్నాడా? లేక చెడ్డి గ్యాంగ్ లీడర్ అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తం లాగా తయారైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులా ఉందని ఎంత వేగంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని.. ఈసారి కూడా మెదక్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment