Telugu News » Hyderabad : చెర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు సిద్ధం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం..!

Hyderabad : చెర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు సిద్ధం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం..!

కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదని మండిపడ్డ సీఎం.. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిననే విషయం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

by Venu
bjp counter attack on brs leaders comments

హైదరాబాద్ శివారు తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) జనజాతర పేరుతో తలపెట్టిన భారీ బహిరంగ సభలో మాటల తూటాలు పేలుతున్నాయి.. ఒకవైపు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుండగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం.. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)ను గట్టిగానే అరుసుకొన్నారు.. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ (KCR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raithu Nestham: CM Revanth started another innovative program of the Congress government..!కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదని మండిపడ్డ సీఎం.. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిననే విషయం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్లపల్లి జైలులో చిప్పకూడు సిద్దం చేస్తానని హెచ్చరించారు. ఆయనకు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎద్దేవా చేశారు.. పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండి వందేళ్ల విధ్వంసం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు విరిగింది.. కూతురు కవిత జైలుకు వెళ్లిందని ఏమనకుండా జాలి చూపించామన్నారు. కానీ అధికారం కోసం కొత్త నాటకాలు వేస్తే.. ఏం చేయాలో అదే చేస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ నుంచి తెలంగాణకు నిధులు రావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలు తప్పని సరిగ్గా గెలవాలని పేర్కొన్నారు..

మరోవైపు బీజేపీపై నిప్పులు చెరిగిన సీఎం.. తుక్కుగూడలో బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడించిన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు.. మరీ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు.

మూడోసారి అధికారం కోసం మతం పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదలొస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక్క పైసా అయిన తెచ్చారా అని ప్రశ్నించారు.. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. తెలంగాణ స్ఫూర్తిని దేశమంతా తీసుకొస్తామని తెలిపిన ఆయన.. ఢిల్లీలో జూన్‌లో కాంగ్రెస్ మువ్వెన్నల జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment