Telugu News » Hyderabad : ఊహలకు అందని సమస్యలు సృష్టిస్తున్న ఉచిత బస్సు పథకం.. కండక్టర్‌కు చెప్పుదెబ్బలు..!

Hyderabad : ఊహలకు అందని సమస్యలు సృష్టిస్తున్న ఉచిత బస్సు పథకం.. కండక్టర్‌కు చెప్పుదెబ్బలు..!

ఈ క్రమంలో రెండు వారల క్రితం ఎల్బీ నగర్‌ (LB Nagar)లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు.. కండక్టర్‌ను ఓ మహిళా ప్రయాణికురాలు కాలితో తన్నిన విషయం తెలిసిందే. తాజాగా శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన ప్రసన్న అనే మహిళ.. శివరాంపల్లిలో బస్సు ఎక్కింది.

by Venu

తెలంగాణా (Telangana)లో ఉచిత బస్సు పథకం.. ఊహలకు అందని సమస్యలు సృష్టిస్తుందనే ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఆర్టీసీ సిబ్బంది సహనానికి ఈ డ్యూటీలు పరీక్షలు పెడుతున్నాయి. ఇప్పటికే ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు సిబ్బందిపై నోరుతో పాటు చేయి, కాలు పారేసుకొంటున్న సంఘటనలు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలో రెండు వారల క్రితం ఎల్బీ నగర్‌ (LB Nagar)లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు.. కండక్టర్‌ను ఓ మహిళా ప్రయాణికురాలు కాలితో తన్నిన విషయం తెలిసిందే. తాజాగా శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన ప్రసన్న అనే మహిళ.. శివరాంపల్లిలో బస్సు ఎక్కింది. ఈమె హైదర్‌గూడ (Hyderguda) కల్లు కంపౌండ్‌ దగ్గర దిగాల్సి ఉంది. కానీ అత్తాపూర్‌లో దిగింది. మళ్లీ వెనక్కి వెళ్లేందుకు రోడ్డుదాటి మెహదీపట్నం నుంచి ఉప్పల్‌ వెళ్తున్న 300 నంబర్‌ బస్సు ఎక్కింది.

దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్‌స్టాప్‌లో దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్‌ ఆమెను ఎక్కడ దిగాలని అడిగారు. ఆపమన్న చోట బస్సు ఆపకుండా.. ప్రశ్నలు వేస్తున్నావా అంటూ ఆగ్రహానికి గురైన మహిళ.. చెప్పుతో కండక్టర్‌ చెంపలు చెల్లుమనిపించింది. మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ బూతులు తిట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకొని బస్సును రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

కానీ పీఎస్‌ వద్ద బస్సు ఆగగానే ప్రసన్న అక్కడి నుంచి పరారైంది. కండక్టర్‌ ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవ‌ల వరుసగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బందిని పెడితే కఠిన చర్యలుంటాయని సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. అయినా సిబ్బందిపై దాడులు ఆగ‌డం లేదు.

You may also like

Leave a Comment