Telugu News » Karimnagar : కరీంనగర్​ జిల్లాలో ప్రేమికుడి ఘాతుకం.. యువతిపై నిర్దాక్షిణ్యంగా..!!

Karimnagar : కరీంనగర్​ జిల్లాలో ప్రేమికుడి ఘాతుకం.. యువతిపై నిర్దాక్షిణ్యంగా..!!

ఈ క్రమంలో వారం కిందట నిందితుడు సాయి, ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని యువతి తండ్రి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించినట్టు తెలుస్తోంది. అయితే అతని మెసేజ్‌ లను ఆ యువతి తండ్రి పట్టించుకొక పోవడంతో నిందితుడు కోపం పెంచుకున్నాడంటున్నారు.

by Venu

కరీంనగర్ (Karimnagar) జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొత్తపల్లి (Kottapalli) మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు ఘోరానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి (26) ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బొద్దుల సాయి ప్రేమిస్తున్నానని గత కొంత కాలంగా వెంటపడుతున్నట్టు సమాచారం..

ఈ విషయమై పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీలు జరిగిన యువకుడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో వారం కిందట నిందితుడు సాయి, ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని యువతి తండ్రి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించినట్టు తెలుస్తోంది. అయితే అతని మెసేజ్‌ లను ఆ యువతి తండ్రి పట్టించుకొక పోవడంతో నిందితుడు కోపం పెంచుకున్నాడంటున్నారు.

దీంతో సమయం కోసం కాచుకుని ఉన్న నిందితుడు.. గురువారం సాయంత్రం ఆ యువతి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొన్నాడు.. వెంటనే ఆ యువతి ఇంటికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో ఘర్షణకు దిగినట్టు సమాచారం.. ఈ క్రమంలో ఆ యువతి నిరాకరించడంతో కత్తితో (Knife)మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని, అడ్డుకునే ప్రయత్నంలో ఆ యువతి చేయి తెగిందని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘాతుకంపై సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు, ఎస్సై చంద్రశేఖర్‌ ఆసుపత్రికి చేరుకుని యువతి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు సాయి పరారీలో ఉన్నాడని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

You may also like

Leave a Comment