Telugu News » Accident : వైసీపీ ఎమ్మెల్సీకి యాక్సిడెంట్.. మృతి చెందిన పీఏ..!!

Accident : వైసీపీ ఎమ్మెల్సీకి యాక్సిడెంట్.. మృతి చెందిన పీఏ..!!

విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ప్రమాద సమయంలో ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటుగా వెళ్తూ.. ప్రమాదాన్ని గమనించినారని అంటున్నారు.

by Venu
Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అధికార వైసీపీ (YCP) పార్టీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి (MLC Parvathar Reddy) వాహనం ప్రమాదానికి గురైంది. లారీని ఎమ్మెల్సీ కారు గురువారం అర్ధరాత్రి దగదర్తి దగ్గర ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

Road Accident: Bloody roads.. Seven dead..!రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టినట్టు సమాచారం. మరోవైపు కారు డ్రైవర్ పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ప్రమాద సమయంలో ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటుగా వెళ్తూ.. ప్రమాదాన్ని గమనించినారని అంటున్నారు.

వెంటనే స్పందించిన ఆయన పోలీసులకి సమాచారం ఇచ్చి.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని, డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment