Telugu News » India : ముంబై వేదిక.. త్వరలో విపక్షాల మూడో భేటీ

India : ముంబై వేదిక.. త్వరలో విపక్షాల మూడో భేటీ

by umakanth rao

 

 

India : కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ విపక్ష కూటమి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరగనుంది. ఈ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో కూటమి పార్టీలన్నీ కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నాయని ఆయన చెప్పారు. డీఎంకే తరఫున తానూ ఇందులో పాల్గొనబోతున్నానన్నారు.

 

TN CM Stalin Shifts Tamil Nadu Day To July 18 From Nov 1. Know Why

 

కాగా ఇండియా కూటమి మొదటిసారి సమావేశం గత జూన్ 23 న పాట్నాలో జరిగింది. నాటి ఆ సమావేశానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు, టీఎంసీ సహా మొత్తం 16 పార్టీలు హాజరయ్యాయి. ఆ తరువాత జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండో భేటీ జరిగింది. ఆ సమావేశాలకు 26 పార్టీలు హాజరు కావడం విశేషం.

అంటే కేవలం నెల రోజుల్లోనే కూటమి పార్టీల సంఖ్య మరో పదికి పెరిగింది. దీంతో తమ కూటమికి ‘ఇండియా’ గా ఇవి నామకరణం చేశాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించడానికి ఈ విపక్షాలు వరుసగా సమావేశాలు జరుపుతున్నాయి.

ముంబైలో త్వరలో జరగనున్న సమావేశాల్లో.. ఇదివరకటి భేటీలో చర్చించని అంశాలను కూడా చర్చిస్తారని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహంపై ఇవి కసరత్తు చేస్తున్నాయి.

You may also like

Leave a Comment