Telugu News » Kadiyam Srihari: ఆ ఇద్దరూ తోడు దొంగలే: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: ఆ ఇద్దరూ తోడు దొంగలే: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)కి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ తనను విమర్శించే స్థాయి కాదని కడియం అన్నారు.

by Mano
Kadiyam Srihari: Both are co-thieves: MLA Kadiyam Srihari

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)కి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ తనను విమర్శించే స్థాయి కాదని కడియం అన్నారు.

Kadiyam Srihari: Both are co-thieves: MLA Kadiyam Srihari

ఆయన ఓ దొంగ అని రాజయ్య మరో దొంగ అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ తోడు దొంగలు అంటూ విమర్శలు గుప్పించారు. తోడు దొంగలు వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి సూచించారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి అని దుయ్యబట్టారు.

దళిత బంధులో రాజయ్యతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పల్లా చేసినట్లు తాను ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదని తెలిపారు. మనబడి మన ప్రణాళికలో సొంత తమ్ముడికి కాంట్రాక్టు ఇవ్వగా అతడిపైకేసు నమోదైందని, పల్లాపై కూడా భూ కబ్జాలు చేశాడని కేసు నమోదైందని కడియం శ్రీహరి గుర్తు చేశారు.

రూ.104 కోట్ల కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. దీన్ని నిరూపిస్తే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా? అని పల్లాకు కడియం సవాల్ విసిరారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్‌లో తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment