Telugu News » KA Paul : ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇప్పిస్తా.. కేఏపాల్..!

KA Paul : ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇప్పిస్తా.. కేఏపాల్..!

రాజకీయంగా ఓడిపోతావని చెబితే నన్ను కొట్టించావ్.. సిరిసిల్ల (Siricilla)లో నీ కొడుకుతో... అనిల్ రెడ్డితో మే 2, 2022లో కొట్టించావ్. ఆ రోజే నిన్ను శపించాను.

by Venu

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ (CBI), ఐటీ (IT) సోదాల భయం ఉంటే.. ఎవరైనా తన వద్దకు రావొచ్చునన్నారు. తాను వారిని కాపాడుతానని వెల్లడించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి వారికి ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పిస్తానని పేర్కొన్నారు..

kcr is a dictator jagan is a waste fellow revanth is a public servant ka paul is harshly criticisedనేడు కేసీఆర్ (KCR) కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయారని తెలిపిన పాల్.. తాను వంద సార్లు ఇలా జరుగుతుందని.. అయినా నా మాటలు పట్టించుకోలేదని అన్నారు. మీ విధానాలను మార్చుకోవాలని లేదంటే.. రాజకీయంగా ఓడిపోతావని చెబితే నన్ను కొట్టించావ్.. సిరిసిల్ల (Siricilla)లో నీ కొడుకుతో… అనిల్ రెడ్డితో మే 2, 2022లో కొట్టించావ్. ఆ రోజే నిన్ను శపించాను. నువ్వు మసి అయిపోలేదా? అని వ్యాఖ్యానించారు..

ఇప్పుడైనా మారుతావా? అని పాల్ ప్రశ్నించారు.. మారాను అని నిరూపించుకోవాలంటే వరంగల్‌లో బాబు మోహన్‌ (Babu Mohan)కు మద్దతివ్వు… అప్పుడు నేను నిన్ను క్షమిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అలాగే 12 లోక్ సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. 1451 సినిమాల్లో నటించిన బాబుమోహన్ టీడీపీని కాళ్లతో తన్ని బీజేపీలో చేరి… ఆ తర్వాత బీజేపీని కాళ్లతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారో ఆలోచించాలన్నారు.

మరోవైపు ఏపీ రాజకీయాలపై కూడా పాల్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మద్దతివ్వడం లేదు? నాకే సీక్రెట్‌గా ఎందుకు మద్దతిస్తున్నారు? ఈ విషయాన్ని ఏపీ ప్రజలు గమనించి ఆలోచించాలని అన్నారు..

You may also like

Leave a Comment