Telugu News » Kerala : టీటీఈ ప్రాణం తీసిన టికెట్‌..!

Kerala : టీటీఈ ప్రాణం తీసిన టికెట్‌..!

. వినోద్ ని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో వినోద్ అవతలి పట్టాలపై పడిపోగా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు..

by Venu

ప్రస్తుత సమాజంలో ఆలోచన కోల్పోతున్న కొందరు తోటి వారిపట్ల దారుణంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన కేరళ (Kerala)లో చోటు చేసుకొంది. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈ (TTE) ని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం (Ernakulam) నుంచి పాట్నా (Patna) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో (Express) ఈ ఘోర సంఘటన చోటుచేసుకొంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొంటే.. టీటీఈ వినోద్‌ తన విధుల్లో భాగంగా నిన్న రాత్రి ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ 11 బోగీలో ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్‌ అనే ప్రయాణికుడిని సైతం టెకెట్‌ చూపించమని అడిగారు. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఆ ప్రయాణికుడు.. వినోద్ ని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో వినోద్ అవతలి పట్టాలపై పడిపోగా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు.. కాగా ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పాలక్కాడ్‌ (Palakkad) వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకొన్నారు.. ఇతను ఒడిశాకు చెందిన వాడిగా గుర్తించారు.

కాగా మద్యం మత్తులో రజనీకాంత్ ​ ఈ ఘాతుకానికి పాల్పడినటుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఎర్నాకుళంకు చెందిన టీటీఈ వినోద్‌ కొన్ని సినిమాల్లో కూడా నటించారని సమాచారం. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు..

You may also like

Leave a Comment