Telugu News » 32 ఏళ్ల క్రితమే శపధం చేసిన నరేంద్ర మోడీ.. అయోధ్య మందిర విగ్రహ ప్రతిష్ట చేయాలన్న సంకల్పం ఎప్పటిదంటే?

32 ఏళ్ల క్రితమే శపధం చేసిన నరేంద్ర మోడీ.. అయోధ్య మందిర విగ్రహ ప్రతిష్ట చేయాలన్న సంకల్పం ఎప్పటిదంటే?

32 ఏళ్ల క్రితమే శపధం చేసిన నరేంద్ర మోడీ..

by Sri Lakshmi

నేడు అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. అయితే.. ఈ బృహత్తర కార్యక్రమం జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ముప్పై రెండు సంవత్సరాల క్రితమే శపధం చేసుకున్నారట. జనవరి 14, 1992 న అంటే.. దాదాపు ముప్పై రెండు సంవత్సరాల క్రితం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర చేస్తున్నప్పుడు నరేంద్ర మోదీ అయోధ్యలోని రామజన్మభూమికి వచ్చారని మీకు తెలుసా? ఆ సమయంలో ప్రధాని మోడీ శ్రీరాముని కీర్తిస్తూ జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేసారు.

ఆ సమయంలో ఒక గుడారంలో ఉంచిన శ్రీరాముని పూజలో పాల్గొన్నాడు. గుడి కట్టిన తర్వాతే తిరిగి వస్తానని మోదీ ప్రకటించిన సందర్భాన్ని ఇప్పుడు జర్నలిస్టులు గుర్తు చేసుకుంటున్నారు. 1992లో ప్రధాని మోదీ రామ మందిర నిర్మాణం తర్వాతే ఇక్కడికి వస్తానని ప్రమాణం చేశారు. మరియు 32 సంవత్సరాల తర్వాత, చివరకు, 2024లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2024 లో అయోధ్యకు వచ్చారు. సోషల్ మీడియాలో ఈ చారిత్రాత్మక సందర్భం యొక్క విశ్లేషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కాశ్మీర్‌ను భారతదేశంతో విలీనం చేయడం స్వాతంత్య్రానంతరం జనసంఘ్ మరియు బిజెపి చేసిన ప్రయత్నం ఎలా జరిగిందో.. అలానే అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రయత్నాలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో విజయవంతమైంది. ఆయన ప్రతిజ్ఞను పూర్తి చేయడంలో మొదటి అడుగు శంకుస్థాపన. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలంగా విశ్వసించే స్థలంలో 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ భారీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16 నుంచే ప్రారంభం అయ్యాయి. జనవరి 22 న ప్రధాన వేడుక కూడా పూర్తి అయ్యింది. అయితే.. ఇందుకోసం ప్రధాని మోడీ ముప్పై రెండు సంవత్సరాల క్రితమే శపధం చేసారన్న సంగతి తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

You may also like

Leave a Comment