Telugu News » Raja Singh : మరోసారి బెదిరింపు కాల్స్ పై సీరియస్ అయిన రాజాసింగ్.. దమ్ముంటే ఎదురుగా రావాలంటూ సవాల్..!!

Raja Singh : మరోసారి బెదిరింపు కాల్స్ పై సీరియస్ అయిన రాజాసింగ్.. దమ్ముంటే ఎదురుగా రావాలంటూ సవాల్..!!

చాటుగా ఉండి రోజూ కాల్స్ చేసి బెదిరించడం కాదు.. గుండె ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రావాలని తెలిపారు.. ఎవరు ఎంతగా బెదిరించిన నేను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని సృష్టం చేశారు.

by Venu

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే గోషామహల్ (Goshamahal), బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజా సింగ్‌ (MLA Raja Singh)కు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు.. గతంలో పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపిన ఎమ్మెల్యే.. మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు స్వయంగా వీడియో బయటపెట్టారు. అంతే కాకుండా.. తనకు వస్తున్న కాల్ లిస్ట్ సైతం చూపించారు. ఈ నెంబర్లతోనే రోజూ కాల్స్ వస్తున్నాయని తెలిపారు..

శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీయవద్దని అపరిచితులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు.. శోభయాత్ర తీస్తే కాల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన వాయిస్ ని స్వయంగా మీడియాకు వినిపించారు. ఈ సందర్భంగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్తానని.. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సుమారు 20 వరకు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు.

నన్ను బెదిరించే వాడు ఒక అమ్మకు పుట్టి వుంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడని సవాల్ విసిరారు.. చాటుగా ఉండి రోజూ కాల్స్ చేసి బెదిరించడం కాదు.. గుండె ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రావాలని తెలిపారు.. ఎవరు ఎంతగా బెదిరించిన నేను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని సృష్టం చేశారు.. ఇదిలా ఉండగా జనవరి 22న అయోధ్యలో శ్రీరామప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు (Thugs) బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. మరోసారి వస్తున్న కాల్స్ పై సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు..

You may also like

Leave a Comment