– ఫలించని కేసీఆర్ తో చర్చలు
– పార్టీ మారేందుకే మొగ్గు చూపిన కేకే
– త్వరలో కాంగ్రెస్ లో చేరిక
– కేకేతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా
– కానీ, బీఆర్ఎస్ లోనే ఉంటానన్న తనయుడు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం బీఆర్ఎస్ పై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఉనికిని కోల్పోతున్న గులాబీని చిగురింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. పార్టీపై నమ్మకం లేని నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కూడా పార్టీ మారుతున్నారు.
