Telugu News » PM Modi: భారతీయుల రక్షణే మా తొలి ప్రాధాన్యత: ప్రధాని మోడీ

PM Modi: భారతీయుల రక్షణే మా తొలి ప్రాధాన్యత: ప్రధాని మోడీ

ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300కి పైగా క్షిప‌ణులు ప్ర‌యోగించింది. ఈ నేపథ్యంలో ప్రధాని న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లోని భార‌తీయుల ర‌క్ష‌ణ త‌మ ప్ర‌భుత్వ తొలి ప్రాధాన్య‌త అని స్ప‌ష్టం చేశారు.

by Mano
PM Modi: Protection of Indians is our first priority: PM Modi

ఇరాన్‌, ఇజ్రాయెల్(Iran-Israel) మ‌ధ్య‌ యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సిరియా(Syria)లోని ఎంబ‌సీ కార్యాల‌యంపై వైమానిక దాడికి ప్ర‌తిస్పంద‌న‌గా ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300కి పైగా క్షిప‌ణులు ప్ర‌యోగించింది. ఈ నేపథ్యంలో ప్రధాని న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లోని భార‌తీయుల ర‌క్ష‌ణ త‌మ ప్ర‌భుత్వ తొలి ప్రాధాన్య‌త అని స్ప‌ష్టం చేశారు.

PM Modi: Protection of Indians is our first priority: PM Modi

అక్టోబ‌ర్‌లో ఇజ్రాయెల్‌, హ‌మాస్ మ‌ధ్య దాడులు జ‌రిగిన స‌మ‌యంలోనూ ఇజ్రాయెల్‌లోని మన వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఆప‌రేష‌న్ అజ‌య్ చేప‌ట్టింది భారత ప్రభుత్వం. త‌ద్వారా 1,309 మంది భార‌త పౌరులు, 14 మంది ఓసీఐ కార్డుదారులు, 20 మంది నేపాలీల‌ను తరలించింది. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య వార్ స‌మ‌యంలోనూ మోడీ సర్కార్ ‘ఆప‌రేష‌న్ గంగా’ ద్వారా 25వేల మంది భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది.

తాజాగా ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య ఉద్రిక్త‌త నేప‌థ్యంలో అక్క‌డ ఉంటున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారంలోకి వ‌స్తే ఉద్రిక్త‌త‌లు చెల‌రేగుతున్న ప్రాంతాల్లో భారతీయుల భ‌ద్ర‌తకు ప్రాధాన్యం ఇస్తామ‌ని ప్రధాని మోడీ వెల్లడించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల మ‌ధ్య త‌ర‌చూ అనిశ్చిత, యుద్ధ వాతావరణ ప‌రిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్ర‌పంచ దేశాల్లో శాంతి లేదని వ్యాఖ్యానించారు.

ఇలాంటి సమయంలో దేశ పౌరుల‌ భ‌ద్ర‌తకు భ‌రోసా ఇవ్వ‌డం చాలా ముఖ్యమని అన్నారు. మెజారిటీతో బ‌ల‌మైన‌, స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవ‌డమే మన ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యమని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా మ‌రింత దృఢంగా మార్చే ప్ర‌భుత్వం అవ‌స‌రమని అభిప్రాయపడ్డారు. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ ‘విక్షిత్ భార‌త్’ దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉందని మోడీ పునరుద్ఘాటించారు.

You may also like

Leave a Comment