Telugu News » Ram Charan: స్టార్ హీరో దంపతులకు అయోధ్య రామమందిర ఆహ్వానం..!

Ram Charan: స్టార్ హీరో దంపతులకు అయోధ్య రామమందిర ఆహ్వానం..!

ఈనెల 22న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులకు అయోధ్య ఆహ్వానం అందింది.

by Mano
Ayodhya Ram Mandir: VIP tickets for Ayodhya Ram Mandir opening ceremony..? Clarity..!

అయోధ్య రామ మందిరం(Ayodya Ram mandir) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 22న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ(PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

Ayodhya Ram Mandir: VIP tickets for Ayodhya Ram Mandir opening ceremony..? Clarity..!

తాజాగా రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులకు అయోధ్య ఆహ్వానం అందింది. ఆర్ఎస్‌ఎస్‌ నేత సునీల్ అంబేకర్ హైదరాబాద్‌లోని రామ్‌చరణ్‌ నివాసానికి వెళ్లి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ దంపతులు ఇప్పుడు సంక్రాంతి సంబురాల నేపథ్యంలో తమ కుమార్తె క్లింకారతో కలిసి బెంగుళూరు వెళ్లారు. రామ్‌ చరణ్ దంపతుల వెంట వారికి ఇష్టమైన పెట్‌ డాగ్‌ కూడా వారితో ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు

సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఇప్పటికే అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రజనీకాంత్, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కంగనా రనౌత్‌, ధనుష్‌, జాకీ ష్రాఫ్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ తదితరులు ఆహ్వానాలను అందుకున్నారు.

You may also like

Leave a Comment