Telugu News » Ram Mandir: అద్భుతం.. 14 లక్షల దీపాలతో శ్రీరాముడి కళాఖండం..!!

Ram Mandir: అద్భుతం.. 14 లక్షల దీపాలతో శ్రీరాముడి కళాఖండం..!!

బీహార్‌(Bihar)కు చెందిన కళాకారులు అద్భుతమైన కళాఖండాలు అయోధ్యలో ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ఇక్కడ 14లక్షల దీపాల(14lack Colorful Lamps)తో శ్రీరాముడి కళాఖండాన్ని రూపొందించారు.

by Mano
Ram Mandir: Marvelous.. Lord Rama's masterpiece with 14 lakh lamps..!!

అయోధ్య(Ayodhya)లో రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌(Bihar)కు చెందిన కళాకారులు అద్భుతమైన కళాఖండాలు అయోధ్యలో ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ఇక్కడ 14లక్షల దీపాల(14lack Colorful Lamps)తో శ్రీరాముడి కళాఖండాన్ని రూపొందించారు.

Ram Mandir: Marvelous.. Lord Rama's masterpiece with 14 lakh lamps..!!

ఇది ప్రపంచ రికార్డు నమోదు చేసింది. బీహార్‌కు చెందిన అనిల్ కుమార్ తన 12 మంది సహచరులతో కలిసి ఈ కళాఖండాన్ని రూపొందించారు. దీని పొడవు 250 అడుగులు కాగా వెడల్పు 150 అడుగులు. ఈ కళాఖండాన్ని మొత్తం 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు.

కేంద్ర మంత్రి అశ్విని చౌబే దీని ప్రధాన నిర్వాహకులు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే అభ్యుదయ రథయాత్రతో బీహార్ నుంచి అయోధ్య చేరుకున్నారు. ఆయన కాన్వాయ్‌లో 750కి పైగా వాహనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబురాల్లో వేలాదిమంది పాల్గొననున్నారు.

కేంద్ర మంత్రి అశ్విని చౌబే నేతృత్వంలోని రాముడి కోసం వందలాది మంది ప్రజలు మిథిలా నుంచి ఇక్కడకు వచ్చారు. చౌబే ఈ రథయాత్రతో బక్సర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అయోధ్య చేరుకున్నారు. బీహార్‌లోని ప్రతీ మత స్థలం నుంచి 2వేల మందికి పైగా ప్రజలు గంగాజలం, ఇతర కానుకలను తీసుకువెళ్లారు.

You may also like

Leave a Comment