Telugu News » Rangareddy: శంషాబాద్‌లో దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య..!

Rangareddy: శంషాబాద్‌లో దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య..!

శంషాబాద్(Shamshabad) మండలం ఝాన్సీమియాగూడ గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్ళతో మోది హతమార్చారు.

by Mano
Bhopal: Tragedy.. A devotee committed death by cutting his throat in the temple..!

రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శంషాబాద్(Shamshabad) మండలం ఝాన్సీమియాగూడ గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్ళతో మోది హతమార్చారు.

Rangareddy: Atrocity in Shamshabad.. A young man was stabbed to death..!

విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద దొరికిన ఓ బ్యాగ్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకున్నారు. హత్యకు గురైన యువకుడు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేష్‌గా గుర్తించారు. కొన్ని రోజుల కింద భార్యను వదిలి శంషాబాద్ ప్రాంతానికి వచ్చి అడ్డాకులిగా మారాడు.

అయితే అప్పుడప్పుడు ఝాన్సీమియాలో ఓ గుడిలో తల దాచుకునేవాడు. అయితే రాత్రి బెంగళూరు జాతీయ రహదారి పక్కన హత్యకు గురై పడి ఉన్నాడు. అయితే మల్లేష్ బంధువులు ఏమయ్యారు? కుటుంబ సభ్యులు ఎవరు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

అతడి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అని ఆరా తీస్తున్నారు. మృతుడి భార్య ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు హత్యపై ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపారు. హత్య చేసింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

You may also like

Leave a Comment