Telugu News » Road Accident: ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!

Road Accident: ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.

by Mano
Road Accident: Fatal accident.. Six people died..!

రెండు లారీలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) ఏపీ(AP)లో నెల్లూరు జిల్లా(Nellore District)లో చోటుచేసుకుంది.

Road Accident: Fatal accident.. Six people died..!

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Road Accident: Fatal accident.. Six people died..!

ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్‌, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

You may also like

Leave a Comment