Telugu News » Satya Pal Malik : మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ సోదాలు..!

Satya Pal Malik : మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ సోదాలు..!

ఈమేరకు సుమారు 100 మంది సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. కాగా, సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన.. 2,200 కోట్ల రూపాయల విలువైన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

by Venu

జమ్ము-కాశ్మీర్‌ (Jammu Kashmir) మాజీ గవర్నర్‌ (Former Governor) సత్యపాల్‌ మాలిక్‌ (Satya Pal Malik)కు సీబీఐ (CBI) అధికారులు షాకిచ్చారు.. ఆయనపై జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలున్న నేపథ్యంలో, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. మాలిక్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ (Delhi)తో పాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన మొత్తం 30 చోట్ల.. నేటి ఉదయం నుంచి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఈమేరకు సుమారు 100 మంది సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. కాగా, సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు (Kiru Hydropower) నిర్మాణ పనులకు సంబంధించిన.. 2,200 కోట్ల రూపాయల విలువైన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 2022వ సంవత్సరంలో సత్యపాల్‌ మాలిక్‌ సహా ఐదుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది.

మరోవైపు సత్యపాల్‌ మాలిక్‌, జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్‌ 30 వరకు పని చేశారు. ఆ సమయంలో ఈ అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా సీబీఐ సోదాలపై సత్యపాల్‌ రియాక్ట్ అయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన ఇంటిపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఈ సోదాల ద్వారా తన డ్రైవర్, సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారని మాజీ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు తనను నిలువరించలేవని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ (X) ద్వారా వెల్లడించారు. సోదాలకు తాను భయపడేది లేదన్న ఆయన.. రైతుల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment