Telugu News » Burning accident : బస్ ఢీకొట్టి ఓ యువకుడి మృతి బస్ దగ్ధం!!

Burning accident : బస్ ఢీకొట్టి ఓ యువకుడి మృతి బస్ దగ్ధం!!

మేడ్చల్(Medical)మల్కాజ్ గిరి జిల్లా(Malkaz Giri District) శామీర్ పేట్(Sameer Pate)మండలం జినోమ్ వ్యాలీ(Genome Valley) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

by sai krishna
ramilla radhika fire on balka suman

మేడ్చల్(Medical)మల్కాజ్ గిరి జిల్లా(Malkaz Giri District) శామీర్ పేట్(Sameer Pate)మండలం జినోమ్ వ్యాలీ(Genome Valley) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.కాగా బస్ కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధం అయ్యింది.

 

స్థానికుల సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం 5:30 ప్రాంతంలో డ్యూటీ నిమిత్త బైక్ పై వెళ్తున్న యువకుడు ప్రమాద వశాత్తు బస్సుని ఢీకొట్టాడు .దీంతో బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యి బైక్ నుంచి మంటలు చెలరేగి తద్వారా బస్ కు మంటలు సైతం మంటలు అంటుకున్నాయి.


కొత్తూరు గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రధాన రహదారిపై తుర్కుపల్లి నుంచి ఎదురుగా వస్తున్న కర్కపట్ల ఫార్మాకంపెనీ (Karkapatla Pharma Company)బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్(26) అక్కడికక్కడే మరణించాడు.

 

మృతుడు సిద్ధిపేట జిల్లా ములుగు మండలానికి దామరకుంట వరదరాజు పురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యి బైక్ తో పాటు బస్ కు కూడా మంటలు అంటుకున్నాయి.

దీంతో సదరు ఫార్మాకంపెనీ సిబ్బంది భయంతో కిందికి దిగేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.అప్పటికే బస్ దగ్ధం పూర్తిగా అయ్యింది.

You may also like

Leave a Comment