Telugu News » Hyderabad : జీడిమెట్లలో గంజాయి కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు..!!

Hyderabad : జీడిమెట్లలో గంజాయి కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు..!!

రాజమండ్రి లో గంజాయిని లోడ్ చేసి..అది కంపించకుండా పైన నర్సరీ మొక్కలను ఉంచి మహరాష్ట్ర తీసుకొని వెళ్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు వెల్లడించిన బాలనగర్ డీసీపీ శ్రీనివాస రావు.. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందని వెల్లడించారు..

by Venu

మేడ్చల్ (Medical) జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. జీడిమెట్ల (Jedimetla) పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్స్ నర్సరీ మొక్కలు చాటున డీసీఎం (DCM)లో గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యినట్టు తెలుస్తోంది.

కాగా గంజాయిని తరలిస్తోన్న ముఠాను బాలానగర్ (Balanagar) ఎస్వోటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు షాపూర్ నగర్, సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ప్యాకెట్లలో ప్యాక్ చేసిన దాదాపు 400 కేజీల ఎండు గంజాయి దొరికినట్టు పోలీసులు వెల్లడించారు.

అనంతరం డీసీఎంని, రెండు సెల్ ఫోన్స్, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు.. జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితులు ఒరిస్సాకు చెందిన బబ్లూ ఆలియాస్ కృష్ణ (23), మహరాష్ట్రకు చెందిన గోవింద్ పటిదార్(42)గా తేలిందని సమాచారం. నిందితులు ఇద్దరు డ్రైవర్, క్లీనర్ గా చెలామని అవుతోన్న గంజాయి స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు.

రాజమండ్రిలో గంజాయిని లోడ్ చేసి..అది కంపించకుండా పైన నర్సరీ మొక్కలను ఉంచి మహరాష్ట్ర తీసుకొని వెళ్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు వెల్లడించిన బాలనగర్ డీసీపీ శ్రీనివాస రావు.. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందని వెల్లడించారు..

You may also like

Leave a Comment