Telugu News » Tirumala : తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. బోల్తా పడిన జీపు..!

Tirumala : తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. బోల్తా పడిన జీపు..!

ఐదు మందితో కూడిన భక్తబృందం శ్రీవారి దర్శనం కోసం కొండపైకి AP 20 TV 0204 అనే నెంబరు గల జీపులో బయలుదేరారు. ఈ క్రమంలో జీపు ఒక్కసారిగా అదుపుతప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.

by Venu
Road Accident: Bloody roads.. Seven dead..!

కలియుగ దైవం అయిన ఆ వెంకటేశ్వరున్ని దర్శించుకోవాలని ఆశిస్తున్న కొందరి భక్తులకు ఏదో ఒక రూపంలో ఆటంకాలు ఎదురవుతుండటం కనిపిస్తోంది. కరోనా తర్వాత నుంచి కాలినడక వెళ్లాలంటే అడవి జంతువులతో ప్రాణభయం ఎదురవుతోన్న దృశ్యాలు చోటు చేసుకొంటున్నాయి.. ఇక రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు ఆడపాడదపా ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

A car hit the divider on ORR.. Two people died on the spot!ఇక తాజాగా తిరుమల (Tirumala) రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.. నేడు జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన భక్తురాలు గాయపడిందని సమాచారం. చెన్నై (Chennai)కి చెందిన ఐదు మందితో కూడిన భక్తబృందం శ్రీవారి దర్శనం కోసం కొండపైకి AP 20 TV 0204 అనే నెంబరు గల జీపులో బయలుదేరారు. ఈ క్రమంలో జీపు ఒక్కసారిగా అదుపుతప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వయస్సున్న మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. మరోవైపు రక్షక దళాలు ప్రమాదానికి గురైన జీపును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వ్యవహరించారు.. కాగా ఈ ప్రమాదం జరగడంపై విచారణ చేపట్టారు..

You may also like

Leave a Comment