Telugu News » Vanga Geetha: పవన్‌ను లక్ష మెజారిటీతో ఓడిస్తా: వంగా గీత

Vanga Geetha: పవన్‌ను లక్ష మెజారిటీతో ఓడిస్తా: వంగా గీత

తాజాగా పిఠాపురం వైసీపీ(YCP) అభ్యర్థి వంగా గీత(Vanga Geetha) లక్ష మెజారిటీతో పవన్‌ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

by Mano
Vanga Geetha: Defeats Pawan by Lakh Majority: Vanga Geetha

పిఠాపురం నుంచి 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైసీపీ తరఫున వంగా గీత పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. తాజాగా పిఠాపురం వైసీపీ(YCP) అభ్యర్థి వంగా గీత(Vanga Geetha) లక్ష మెజారిటీతో పవన్‌ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Vanga Geetha: Defeats Pawan by Lakh Majority: Vanga Geetha

చేబ్రోలులో శనివారం పవన్‌కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై గీత కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వంగా గీత మీడియాతో మాట్లాడారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనడం సరికాదన్నారు. తన హయాంలోనే వంద ఆలయాలను అభివృద్ధి చేశానని వంగా గీత గుర్తుచేశారు.

ప్రజలకు పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాస కోసం ఏది పడితే అది మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. సినిమా డైలాగులు రియల్ పాలిటిక్స్‌లో పని చేయవని సూచించారు. లక్ష మెజారిటీ తమదేనని తమ కార్యకర్తలు కూడా కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కూటమిగా అందరూ కలిసి ప్రజలకు వలంటీర్లను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను చులకన చేసే విధంగా పవన్ డబ్బులు, కంటైనర్లు అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మండలాల వారీగా తమ నేతలు ప్రచారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తన దగ్గర పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా ఉన్నదని అన్నారు. తనకు లక్ష మెజారిటీ ఖాయమని పునరుద్ఘాటించారు.

You may also like

Leave a Comment