Telugu News » Bharat Ratna Award: ఎల్‌కే అడ్వాణీకి ‘భారత రత్న’ ప్రదానం..!

Bharat Ratna Award: ఎల్‌కే అడ్వాణీకి ‘భారత రత్న’ ప్రదానం..!

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ(BJP leader LK Advani)కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేశారు.

by Mano
Bharat Ratna Award: LK Advani awarded 'Bharat Ratna'..!

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ(BJP leader LK Advani)కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు ఆదివారం అడ్వాణీ నివాసానికి వెళ్లి అవార్డును అందజేశారు.

Bharat Ratna Award: LK Advani awarded 'Bharat Ratna'..!

ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం​ఎస్ స్వామినాథన్, మాజీ ప్రధానులు చౌధరీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, ఉన్నారు. వీరిలో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించింది.

రాష్ట్రపతి భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

మరో మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌధరీ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ తరఫున ఆయన కుమారుడు రమేశ్‌నాథ్‌ ఠాకూర్‌ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎల్​కే అడ్వాణీకి మాత్రం ఆయన నివాసానికి వెళ్లి మరి అవార్డును ప్రదానం చేశారు.

You may also like

Leave a Comment