Telugu News » YS Sharmila: ఇకపై జగన్‌ను అలానే పిలుస్తా: వైఎస్ షర్మిల

YS Sharmila: ఇకపై జగన్‌ను అలానే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ‘నేను జగన్‌రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదట.. ఇప్పటి నుంచి జగన్‌ అన్నగారు అని పిలుస్తా..’ అని అని ప్రకటించారు.

by Mano
Minister Roja: Just as another non-local politician came: Minister Roja

ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఇచ్చాపురం(Ichapuram) పర్యటనలో ఉన్న ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి గురించి తనకేం తెలుసంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Minister Roja: Just as another non-local politician came: Minister Roja

‘మీరు చేసిన అభివృద్ధి చూపించండి.. చూడటానికి సిద్ధంగా ఉన్నా.. సమయం, తేదీ మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా? డిబేట్‌కు మేధావులను పిలుద్దాం.. నాతో పాటు మీడియా వస్తుంది. ప్రతిపక్షాలు ఉంటాయి.

నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి..’ అంటూ సవాల్ విసిరారు. ‘మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా? మీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలని అనుకుంటున్నారు.

మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అని వైఎస్ షర్మిల ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా ‘నేను జగన్‌రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదట.. ఇప్పటి నుంచి జగన్‌ అన్నగారు అని పిలుస్తా..’ అని అని ప్రకటించారు. జగన్‌ను అలా పిలవడానికి తనకేం అభ్యంతరం లేదని షర్మిల చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment