Telugu News » ఉదయ్ కిరణ్ చివరిసారిగా రాసిన లేఖ ఇది.. ఏం రాసారో తెలుసా..?

ఉదయ్ కిరణ్ చివరిసారిగా రాసిన లేఖ ఇది.. ఏం రాసారో తెలుసా..?

by Sravya

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితమే. ఉదయ్ కిరణ్ పేరు వెనకాల ఎంతో స్ఫూర్తిదాయకమైన కథ ఉంటుంది అంతే విషాదకరమైన బాధ కూడా ఉంటుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు ఉదయ్ కిరణ్. కానీ ఆయన తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు. ఎప్పటికప్పుడు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతుంది. ఇప్పుడు ఆయన చివరిసారిగా రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ముందు రాసిన ఉత్తరం ఇది. ఈ లెటర్ తన భార్యని ఉద్దేశించి రాశారు ఇందులో విషిత నీతో ఎంతో మాట్లాడాలని ఉంది కానీ చివరి క్షణంలో నీకు ఈ లెటర్ రాస్తున్నాను. సినిమాల పిచ్చితో ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు ఇండస్ట్రీ నన్ను పిచ్చివాడిని చేసేసింది. అందరూ నన్ను దూరం పెడుతున్నారు అని రాశారు నా భార్యగా నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నానని బాధపడ్డారు ఉదయ్ కిరణ్.

Also read:

ప్రొడ్యూసర్లు అందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు ఈరోజు ఫోన్ చేస్తున్నని మాట ఇచ్చిన ప్రొడ్యూసర్ కూడా దూరం పెట్టేసారు అంటూ రాసుకొచ్చారు ఉదయ్ కిరణ్. తన భార్యని ఉద్దేశించి నువ్వు ఎన్ని చెప్పినా వినే పరిస్థితిలో లేవు వాడు మోసగాడు వాడిని నమ్మొద్దు అంటూ చెప్పారు. అయితే అతను ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. నువ్వు అసలు నిజం తెలుసుకునే రోజు వస్తుందని కాకపోతే ఆరోజు నీ పక్కన నేను ఉండను అని బాధపడ్డాడు ఉదయ్ కిరణ్. అందరూ నా వల్లే బాధపడుతున్నానని ఫీలవుతున్నారు. ఇకనుండి మీకు ఎవరికీ ఈ బాధ ఉండదని ఆయన రాశారు. అలానే తన భార్య దగ్గర ఉన్న నగలని అక్కకి ఇవ్వాలని కోరారు తన భార్యని అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా ఉదయ్ కిరణ్ కోరారు.

You may also like

Leave a Comment