Telugu News » ఈ ఏడాది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సెలబ్రిటీలు వీళ్ళే..!

ఈ ఏడాది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సెలబ్రిటీలు వీళ్ళే..!

by Sravya

ఈ మధ్య చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తుది శ్వాసను విడవడం జరిగింది, ఈ ఏడాది మొదల నుండి కొన్ని కారణాల వలన ఎంతో మంది చనిపోయారు. వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటు కారణంగా బెంగళూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు జమున జనవరి 27న తుదిశ్వాసను విడిచారు.

వయసు పైబడటంతో అనారోగ్య సమస్యలు కారణంగా సొంత గృహంలోనే మరణించారు జమున. అలానే ఈ ఏడాది కే విశ్వనాధ్ కూడా కన్నుమూశారు. దర్శకుడుగా ఎన్నో సేవలని విశ్వనాథ్ గారు ఇండస్ట్రీకి చేశారు.

అనారోగ్య సమస్యలు కారణంగా ఫిబ్రవరి 2న చనిపోయారు. సీనియర్ నటుడు శరత్ బాబు కూడా ఈ ఏడాది కన్నుమూశారు. హైదరాబాద్ హాస్పిటల్ లో ఆయన అనారోగ్య సమస్య కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు.

ఈ ఏడాది చంద్రమోహన్ కూడా చనిపోయారు సీనియర్ నటుడు చంద్రమోహన్ సినిమా ఇండస్ట్రీకి చాలా కాలం నుండి దూరమయ్యారు. వయసు పైబడటంతో సినిమాలకు దూరమయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా నవంబర్ 12న చంద్రమోహన్ చనిపోయారు.

Also read:

అలానే ఈ ఏడాది కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్న రాకేష్ మాస్టర్ కూడా జూన్ 18న చనిపోయారు. రాజ్ కోటి కూడా ఈ ఏడాది కనుముసారు. అనారోగ్యం కారణంగా మే 21న ఈయన చనిపోయారు.

You may also like

Leave a Comment