Telugu News » Adilabad: విషాదం.. ఒకేరోజు భార్యాభర్తల ఆత్మహత్య..!!

Adilabad: విషాదం.. ఒకేరోజు భార్యాభర్తల ఆత్మహత్య..!!

గుడిహత్నూర్‌(Gudihatnoor) మండలం కొల్హారి(Kolhari)లో చోటుచేసుకున్నది. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామానికి చెందిన విజయ్‌కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది.

by Mano
Adilabadg: Tragedy.. Husband and wife commit death on the same day..!!

భార్య ఆత్మహత్య చేసుకోగా కొన్ని గంటల్లోనే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా గుడిహత్నూర్‌(Gudihatnoor) మండలం కొల్హారి(Kolhari)లో చోటుచేసుకున్నది. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామానికి చెందిన విజయ్‌కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది.

Adilabadg: Tragedy.. Husband and wife commit death on the same day..!!

 

సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకివెళ్లింది.

దీంతో కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, విజయ్ అదేరోజు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తనపై అపవాదు వస్తుందన్న భయంతో విజయ్‌ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పల్లవి మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. భార్యభర్తలు ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment