Telugu News » Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ డిమాండ్.. వారికి న్యాయం జరిగేలా చూడాలి..!!

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ డిమాండ్.. వారికి న్యాయం జరిగేలా చూడాలి..!!

సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మీరు.. 50 రోజులు కావస్తున్నా పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

by Venu
Our captain is Narendra Modi.. Bandi Sanjay pakka local.. Who is the captain of Congress and BRS?

కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay).. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.

bandisanjay sensational comments on rahul gandhi

సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మీరు.. 50 రోజులు కావస్తున్నా పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి అని బండి డిమాండ్ చేశారు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని కోరిన ఆయన.. మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకొంటుందని తెలిపిన బండి సంజయ్.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. వీటి కారణంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు.

గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలపట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment