Telugu News » BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల..!

BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల..!

ఈ జాబితాలో కీలక నేతలకు కాషాయం షాకిచ్చింది. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు, నాలుగు సార్లు పోటీ చేసిన సీనియర్లను పార్టీ పక్కనబెట్టింది.

by Venu
bjp-big-plans-for-parliament-elections

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తాజాగా విడుదలైంది. ఢిల్లీ (Delhi) బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే (Vinod Thawde) 195 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ నుంచి తొమ్మిది సీట్ల అభ్యర్థులను ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగా ముగ్గురు సిట్టింగులను ఖరారు చేశారు.

మరోవైపు ఈ జాబితాలో కీలక నేతలకు కాషాయం షాకిచ్చింది. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు, నాలుగు సార్లు పోటీ చేసిన సీనియర్లను పార్టీ పక్కనబెట్టింది. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ మరోసారి వారణిసి నుంచి బరిలో డిగానున్నారు.. గాంధీ నగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయబోతున్నారు. ఈమేరకు తొలి జాబితాలో 34 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు.

మహిళలు-28, యువకులు-47, ఎస్సీ-27, ఎస్టీ-18, ఓబీసీ-57 మంది ఉన్నారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీ (BJP) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే 195 మందితో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.

ఇక తెలంగాణ (Telangana) నుంచి బరిలోకి దిగుతున్న పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు చూస్తే.. బండి సంజయ్-కరీంనగర్.. అరవింద్ ధర్మపురి-నిజామాబాద్.. బిబి పాటిల్-జహీరాబాద్.. ఈటల రాజేందర్-మల్కాజిగిరి.. కిషన్ రెడ్డి-సికింద్రాబాద్.. మాధవి లత-హైద్రాబాద్.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి-చేవెళ్ల.. భరత్ గౌడ్- నాగర్ కర్నూల్.. బూర నర్సయ్య గౌడ్- భువనగిరి..

You may also like

Leave a Comment