Telugu News » షర్మిల కి కాబోయే కోడలు అట్లూరి ప్రియా, రాజా రెడ్డి ల ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా ?

షర్మిల కి కాబోయే కోడలు అట్లూరి ప్రియా, రాజా రెడ్డి ల ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా ?

అట్లూరి ప్రియా, రాజా రెడ్డి ల ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా ?

by Sri Lakshmi

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహాన్ని తన స్నేహితురాలు అట్లూరి ప్రియతో జరిపిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. జనవరి పద్దెనిమిదిన వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ను కూడా గ్రాండ్ గా జరిపించారు. కొత్త దంపతులు కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వెళ్లి తొలి ఆహ్వాన పత్రికను అందజేసి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ప్రియా అట్లూరి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. అట్లూరి హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు అయిన అట్లూరి బాలప్రసాద్ కుమార్తె. ఆమె అమెరికాలో ఉన్న సమయంలోనే వై ఎస్ రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది. వైఎస్ రాజా రెడ్డి తొలిసారిగా ప్రియను చర్చిలో కలిశారని సమాచారం. వీరిద్దరూ గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు పలు వార్తా కథనాలలో ప్రస్తావనలు ఉన్నాయి. వైఎస్ షర్మిల – అనిల్ కుమార్ దంపతులు, ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఆమోదం తెలపడంతో.. రీసెంట్ గానే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

రాజా రెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశారు. యూనివర్సిటీ నుంచి డిగ్రీ కూడా అందుకున్నాడు. ఇక ప్రియా అట్లూరి అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్సియల్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు సంగీతం, నృత్యంపై కూడా ఎక్కువ ఆసక్తి ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నారట. వై ఎస్ రాజారెడ్డితో ఆమె పరిచయం ప్రేమగా మారడంతో ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతోనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

You may also like

Leave a Comment