Telugu News » Hyderabad : తెలంగాణలో బయటపడ్డ మరో స్కామ్..!

Hyderabad : తెలంగాణలో బయటపడ్డ మరో స్కామ్..!

వ్యక్తి సమస్యను బట్టి డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో సర్కిల్ నుంచి రూ.3 లక్షల ఆదాయం రాగా.. ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్నట్లు సమాచారం..

by Venu

తెలంగాణలో మరో స్కామ్ వెలుగు చూసింది. బల్దియాలో నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేసిన వైనం ఫలక్‌నుమా సర్కిల్ లో చోటు చేసుకొంది. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం అవినీతికి నిదర్శనంగా మారింది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు సమాచారం.

ఈ దందా సికింద్రాబాద్ (Secunderabad), చార్మినార్ (Charminar), గోషామహల్, ఖైరతాబాద్ (Khairatabad) సర్కిల్స్‌లో జోరుగా సాగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవెలబూలిటి కింద సర్టిఫికెట్ జారీ అయ్యాయి.. అయితే ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు ఈ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. ఉన్నతాధికారుల అండదండలతో దందా నడుస్తున్నట్లు సమాచారం.

అదీగాక వ్యక్తి సమస్యను బట్టి డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో సర్కిల్ నుంచి రూ.3 లక్షల ఆదాయం రాగా.. ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్నట్లు సమాచారం.. మరోవైపు గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోయారని అనుకొంటున్నారు..

అదీగాక ఇప్పటికే సీఎంఓహెచ్‌ (CMOH)పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులు సైతం సీఎమ్‌ఓహెచ్ తమను వేధిస్తున్నారని మేయర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక జీహెచ్‌ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో 2022 నుంచి ‘ఇన్‌స్టంట్‌ అఫ్రూవల్‌’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దవాఖానల్లో జరిగే జనన, మరణాల ధ్రువపత్రాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పత్రాలు జారీ చేస్తుంది.

వివరాలను నమోదు చేసి, సరైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. ఇక ఇంటి వద్ద జరిగే జనన, మరణాల వివరాలు దవాఖానల్లో అందుబాటులో ఉండవు. కాబట్టి వీటిని నాన్‌ అవైలబిలిటీగా పేర్కొంటారు. ప్రధానంగా నాన్‌ అవైలబిలిటీ ఆధారంగా జారీచేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లోనే భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.

You may also like

Leave a Comment