Telugu News » త్రిష ఓ ఫీమేల్ క్రౌడ్ పుల్లర్… నాటి తార ఖుష్బూ కితాబు..!

త్రిష ఓ ఫీమేల్ క్రౌడ్ పుల్లర్… నాటి తార ఖుష్బూ కితాబు..!

by sai krishna

త్రిష ఓ విలక్షణ నటి. ఏ పాత్రైనా,ఏ భాషైనా,ఏ జోనరైనా దర్శకుడి స్క్రీనింగ్ ఐడియాకి తగ్గట్టుగా మౌల్డైపోయే యాక్ట్రెస్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రెండు దశాబ్దాలకుపైగా అలరిస్తోంది. ఇంకా అంతే నాజూకుగా ఉంది.సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తోంది.

త్రిష సినీ జర్నీపై అలనాటి టాప్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్‌ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. ఇంతకీ ఖుష్బూ ఎందుకలా అన్నారోచూద్దాం. ఓ చిట్‌ చాట్‌లో ఖుష్బూ మాట్లాడుతూ.. నటీమణులు 20 ఏండ్లుగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం.

కానీ త్రిష 20ఏళ్లకుపైగా లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతూ నంబర్‌వన్ నటిగా నిలబడింది.అలనాటి అందాల తార, తన నటనతో తమిళ నాట విశేష ఆదర పొందిన తార,..విగ్రహాన్ని పెట్టించుకునేంతగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న తార ఖుష్బూ..త్రిష మేల్ సూపర్ స్టార్ లాగా క్రౌడ్ పుల్లర్..అంటూ ఖుష్బూ సుందర్‌ కితాబిచ్చింది.

అయితే ఖుష్బూ.. ఇలా త్రిషను ఆకాశానికెత్తేస్తూ   కామెంట్స్ చేయడంతో త్రిష బజ్ తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ పొన్నియన్‌ సెల్వన్‌-2తో మంచి సక్సెస్ అందుకుంది త్రిష. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

ఈ భామ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి విజయ్ తో కలిసి నటిస్తున్న లియో. మరోవైపు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటిస్తోన్న రామ్‌.. పార్టు 1 ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. త్రిష తమిళంలో ది రోడ్‌, సథురంగ వెట్టై 2 సినిమాలు ఏచస్తోంది.

అంతేకాకుండా లోకనాయకుడు కమల్ హాసన్‌- మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్నకమల్‌ హాసన్‌ 234 (KH 234) లో త్రిష ఫైనల్ అయినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. అజిత్‌కుమార్‌, మగిజ్ తిరుమేని కాంబోలో వస్తున్నచిత్రంలో కూడా త్రిష పేరునే పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

You may also like

Leave a Comment