Telugu News » IT Raids: హైదరాబాద్‌లో ప్రముఖ బ్రేక్ ఫాస్ట్ ఫ్రాంచైజీపై ఐటీ దాడులు..!

IT Raids: హైదరాబాద్‌లో ప్రముఖ బ్రేక్ ఫాస్ట్ ఫ్రాంచైజీపై ఐటీ దాడులు..!

ప్రముఖ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రాంచైజీ చట్నీస్‌ హోటల్స్‌(Chutneys Hotels)లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

by Mano
IT Raids: IT raids on famous breakfast franchise in Hyderabad..!

హైదరాబాద్‌(Hyderabad)లో మరోసారి ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపాయి. ప్రముఖ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రాంచైజీ చట్నీస్‌ హోటల్స్‌(Chutneys Hotels)లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ యజమాని ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ షర్మిలకు వియ్యంకురాలు అట్లూరి పద్మ(Atluri Padma) కావడం చట్నీస్ హోటల్స్ యజమాని కావడం గమనార్హం.

IT Raids: IT raids on famous breakfast franchise in Hyderabad..!

ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తెకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్‌ ఈటరీస్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నగరంతోపాటు బెంగళూరులోనూ ఈ ఫ్రాంచైజీలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ దాడులకు సంబంధించి హోటళ్ల యజమానులతోపాటు ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అట్లూరి పద్మ పదేళ్ల కిందట ఈ హోటళ్లను ప్రారంభించారు. నగరంలో అనేక శాఖలను విజయవంతంగా నడుపుతున్నారు. అయితే, తాజాగా ఐటీ అధికారులు ఈ హోటల్స్‌లో సోదాలు నిర్వహిస్తుండటంతో సంచలనంగా మారింది.

ఈ హోటల్స్‌తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్ కోకాపేటలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో తొమ్మిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.

You may also like

Leave a Comment