Telugu News » Nara Lokesh: ‘గంజాయిని సర్కారే ప్రోత్సహిస్తోంది’.. నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..!

Nara Lokesh: ‘గంజాయిని సర్కారే ప్రోత్సహిస్తోంది’.. నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..!

చిత్తూరు జిల్లా(Chittoor District)లో స్కూలుకు వెళ్లే బాలికను వైసీపీ ముఠా గంజాయికి బానిస‌ని చేసిందని, గంజాయికి బానిసైన బాలికపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. నియంత్రించాల్సిన స‌ర్కారే ప్రోత్స‌హిస్తోంద‌ని, రాష్ట్రంలో జరుగుతున్న సంఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

by Mano
Nara Lokesh: 'Ganjai is being promoted by the government'.. Nara Lokesh's sensational comments..!

వైసీపీ ప్రభుత్వం(YCP Government)పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్(Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా(Chittoor District)లో స్కూలుకు వెళ్లే బాలికను వైసీపీ ముఠా గంజాయికి బానిస‌ని చేసిందని, గంజాయికి బానిసైన బాలికపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు.

Nara Lokesh: 'Ganjai is being promoted by the government'.. Nara Lokesh's sensational comments..!

విద్యార్థులు మ‌ద్యం మ‌త్తులో బ‌డికొస్తున్నారన్నారు. నియంత్రించాల్సిన స‌ర్కారే ప్రోత్స‌హిస్తోంద‌ని, రాష్ట్రంలో జరుగుతున్న సంఘ‌ట‌న‌లు నిరూపిస్తున్నాయని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాలికను డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌కి పంపామని నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ పాల‌న‌లో బ‌డిలో, గుడిలోకి గంజాయి వ‌చ్చేసిందన్నారు.

సీఎం జ‌గ‌న్‌ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తంచేస్తే, ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారని లోకేశ్ తెలిపారు. సీఎం ఇంటికి స‌మీపంలో మాదకద్రవ్యాల మ‌త్తులో సామూహిక లైంగికదాడి జరిగితే నేటికీ నిందితులను పట్టుకోలేదన్నారు. అదేవిధంగా సీఎం ఇంటికి ద‌గ్గ‌రే మ‌ద్యం మ‌త్తులో ఒక ఉన్మాది అంధురాలిని హ‌త్య‌చేస్తే చ‌ర్య‌ల్లేవంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాలు, మద్యం నిషేధంపై ప్రభుత్వానికి అనేక లేఖలు రాశానని లోకేశ్ గుర్తుచేశారు. అయితే, వైసీపీ సర్కార్ టీడీపీ కార్యాలయాలపై దాడులు, తనపై మాటల దాడులు చేసిందే కానీ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పిల్ల‌లు, యువ‌త బంగారు భ‌విష్య‌త్తు నాశ‌నం కావ‌డం చూసి ఆందోళ‌న‌తో ప్ర‌ధానికీ లేఖ రాసినట్లు లోకేశ్ చెప్పుకొచ్చారు.

చంద్ర‌గిరిలో 9వ త‌ర‌గ‌తి అమ్మాయి గంజాయికి బానిసైందని, చోడ‌వ‌రంలో ఏడ‌వ‌ త‌ర‌గ‌తి విద్యార్థులు స్కూలులో మ‌ద్యం తాగుతుండ‌గా, వీడియో తీసిన వ్య‌క్తిపై దాడికి పాల్ప‌డ్డారని లోకేశ్ అన్నారు. పిల్ల‌లు, యువ‌త బంగారు భ‌విష్యత్తు నాశ‌నమవడానికి కార‌ణ‌మైన దండుపాళ్యం వైసీపీ స‌ర్కారుకి ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పడ్డాక గంజాయి, మాదకద్రవ్యాలు, ప్రమాదకర మద్యంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.

You may also like

Leave a Comment