Telugu News » Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukhesh Ambani) భార్య నీతా అంబానీ(Nita Ambani) ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్‌(Hyderabad) వచ్చారు.

by Mano
Nita Ambani: Nita Ambani visited Ellamma in Balkampeta..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్-(IPL)ఐపీఎల్‌ సీజన్ 17లో భాగంగా చాలా మంది ప్రముఖులు హైదరాబాద్ వచ్చారు. అందులో ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఫ్యామిలీ కూడా ఉంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukhesh Ambani) భార్య నీతా అంబానీ(Nita Ambani) ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్‌(Hyderabad) వచ్చారు.

Nita Ambani: Nita Ambani visited Ellamma in Balkampeta..!

ఆమె హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు. తాజాగా బుధవారం ఆమె బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు నీతా అంబానీ వచ్చారు.

ఈ క్రమంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు. గతంలోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన నీతాఅంబానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. 2019 ఐపీఎల్ ఫైనల్‌ సమయంలో మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లి అమ్మవారికి పూజలు చేయడం విశేషం.

అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరికి ముంబై ఒక్క పరుగు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ చివరలోనీతా అంబానీ మ్యాచ్ చూడకుండా కళ్లు మూసుకుని మంత్రాలు చదువుతూ దండం పెట్టుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment