Telugu News » Rajasingh : రాజాసింగ్‌‌ బెదిరింపుల కేసులో పురోగతి.. వ్యక్తిని కనిపెట్టిన పోలీసులు..!!

Rajasingh : రాజాసింగ్‌‌ బెదిరింపుల కేసులో పురోగతి.. వ్యక్తిని కనిపెట్టిన పోలీసులు..!!

మరోవైపు గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. శ్రీరాముని శోభాయాత్ర చేస్తే చంపేస్తామని దుండగులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.

by Venu

గత కొంత కాలంగా దుండగులు వరసగా కాల్స్ చేసి గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Rajasingh)ను బెదిరిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్ చేసి బెదిరింపులకు దిగిన అదృశ్య వ్యక్తులను గుర్తించారు. కువైట్‌ (Kuwait)లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు.

గత 14 ఏళ్లుగా అతను కువైట్‌లో ఉంటున్నారని, చాంద్రాయణగుట్ట (Chandrayanagutta)నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్ అయ్యినట్టు దర్యాప్తులో గుర్తించామని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌కు, ఖాసిం బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు నిందితునికి ఎల్‌ఓసీని జారీ చేశారు.

మరోవైపు గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. శ్రీరాముని శోభాయాత్ర చేస్తే చంపేస్తామని దుండగులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్న రాజాసింగ్ మ్యాటర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తానికి బెదిరింపులకు పాల్పడుతున్న వారిని కనిపెట్టారు.

You may also like

Leave a Comment