Telugu News » CM Revanth Reddy : దావోస్​లో సీఎం రేవంత్ చేసిన పని ఇదే..!!

CM Revanth Reddy : దావోస్​లో సీఎం రేవంత్ చేసిన పని ఇదే..!!

రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు. ‌అనంతరం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో విడివిడిగా భేటీ అయిన రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

by Venu
cm revanth reddy review on dharani portal

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా.. అదానీ గ్రూప్ (Adani Group) ప్రతినిధులు సైతం రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

cm revanth reddy says prajapalana program starts from december 28th in telangana

ఈ నేపథ్యంలో దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎంను మరోసారి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ కలిశారు.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. వీరిలో టాటా, అదానీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కంపెనీల ఛైర్మన్లు, ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడో రోజు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల ఛైర్మన్‌లు, ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు. ‌అనంతరం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో విడివిడిగా భేటీ అయిన రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, అదానీ గ్రూప్ తెలంగాణ (Telangana)లో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు గాను నాలుగు ఒప్పందాలు చేసుకొంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగా వాట్ల డేటా సెంటర్​ను నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో రూ.5 వేల కోట్ల 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీ గూడంలో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.

అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయిదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి (Gowtham Adani) సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ రూ.2000 కోట్లతో మల్లాపూర్​లో పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది. దావోస్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. అయిదేళ్లలో రూ.2,000 కోట్లతో మల్లాపూర్​లో ఔషధ పరిశ్రమ విస్తరిస్తామని దీంతో సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో తెలిపారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ఎల్​డిసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమైంది.

You may also like

Leave a Comment